NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయితే, సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది అని ఆయన అన్నారు. బీపీ అంటే బాబు.. పవన్ అని ఆయన తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దమ్ముంటే అతని గుర్తు ఎదో ప్రజలకు చెప్పమనండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్సే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనతో మాట్లాడకుండా ఫోన్ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓ మహిళను సీఐ బెదిరిస్తున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.