CM Jagan: సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల భేటీ.. వారిని నమ్మొద్దన్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Comments After Meeting With AP Employees Leaders: మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పలు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన వారితో పలు విషయాలపై చర్చలు జరిపారు. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. అటు.. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో తీసుకున్న జీపీఎస్, కేటినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా.. జీపీఎస్ అమలు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
Also Read
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలూ సంతోషంగా ఉంటారని అన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి.. ప్రతీ కార్యక్రమం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్తే.. ఆ వ్యక్తుల్ని నమ్మొద్దని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు.
Earthquake In Jammu: జమ్మూకశ్మీర్లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు
జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు జీపీఎస్లో ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జీపీఎస్ అన్నది దేశానికే రోల్ మోడల్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిటైరైన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఇదే సమయంలో.. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు.
తాజావార్తలు
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
-
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
-
Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
-
Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్గా ఇలా చేసుకోండి..!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!