Pension Fraud: పెన్షన్ పేరుతో నయా మోసం.. మృతి చెందిన తండ్రి పేరుతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ నయా మోసం వెలుగు చూసింది. మృతి చెందిన తండ్రి బ్రతికే ఉన్నాడని చూపించి.. ఓ వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 12 సంవత్సరాల నుంచి రూ.4 లక్షల మేర పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, ఈ మోసం వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉన్నప్పుడు.. ఏనాడూ ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలాలు లేవు.
Kavya : అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బలగం బ్యూటీ కావ్య..!!
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
అయితే.. కిరీటి చిన్న కుమారుడు మాత్రం ఓ స్కెచ్ వేశాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. 2011లో తన మామను తండ్రిగా చూపించి, ఫేక్ డాక్యుమెంట్లతో పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. అతడు సమర్పించిన వివరాలు నిజమేననుకున్న అధికారులు.. ఆ ఏడాదిలోనే పింఛను మంజూరు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ.. చనిపోయిన తన తండ్రి పేరు మీద అతడు వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కిరీటి బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన పారా కిరీటీ పేరు మీద.. ఆయన కుమారుడు అక్రమంగా పెన్షన్ డబ్బులు డ్రా చేస్తున్నాడని ఆధారాలు సమర్పించారు.
Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
గత 12 సంవత్సరాల నుంచి సుమారు రూ. 4 లక్షలు పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కాజేశాడని.. కిరీటి కుమారుడిపై జాయింట్ కలెక్టర్కు కిరీటీ బంధువులు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనను తెలుసుకొని పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని.. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?