Pension Fraud: పెన్షన్ పేరుతో నయా మోసం.. మృతి చెందిన తండ్రి పేరుతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ నయా మోసం వెలుగు చూసింది. మృతి చెందిన తండ్రి బ్రతికే ఉన్నాడని చూపించి.. ఓ వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 12 సంవత్సరాల నుంచి రూ.4 లక్షల మేర పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, ఈ మోసం వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉన్నప్పుడు.. ఏనాడూ ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలాలు లేవు.
Kavya : అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బలగం బ్యూటీ కావ్య..!!
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
అయితే.. కిరీటి చిన్న కుమారుడు మాత్రం ఓ స్కెచ్ వేశాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. 2011లో తన మామను తండ్రిగా చూపించి, ఫేక్ డాక్యుమెంట్లతో పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. అతడు సమర్పించిన వివరాలు నిజమేననుకున్న అధికారులు.. ఆ ఏడాదిలోనే పింఛను మంజూరు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ.. చనిపోయిన తన తండ్రి పేరు మీద అతడు వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కిరీటి బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన పారా కిరీటీ పేరు మీద.. ఆయన కుమారుడు అక్రమంగా పెన్షన్ డబ్బులు డ్రా చేస్తున్నాడని ఆధారాలు సమర్పించారు.
Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
గత 12 సంవత్సరాల నుంచి సుమారు రూ. 4 లక్షలు పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కాజేశాడని.. కిరీటి కుమారుడిపై జాయింట్ కలెక్టర్కు కిరీటీ బంధువులు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనను తెలుసుకొని పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని.. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..