Pension Fraud: పెన్షన్ పేరుతో నయా మోసం.. మృతి చెందిన తండ్రి పేరుతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ నయా మోసం వెలుగు చూసింది. మృతి చెందిన తండ్రి బ్రతికే ఉన్నాడని చూపించి.. ఓ వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 12 సంవత్సరాల నుంచి రూ.4 లక్షల మేర పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, ఈ మోసం వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉన్నప్పుడు.. ఏనాడూ ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలాలు లేవు.
Kavya : అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బలగం బ్యూటీ కావ్య..!!
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
అయితే.. కిరీటి చిన్న కుమారుడు మాత్రం ఓ స్కెచ్ వేశాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. 2011లో తన మామను తండ్రిగా చూపించి, ఫేక్ డాక్యుమెంట్లతో పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. అతడు సమర్పించిన వివరాలు నిజమేననుకున్న అధికారులు.. ఆ ఏడాదిలోనే పింఛను మంజూరు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ.. చనిపోయిన తన తండ్రి పేరు మీద అతడు వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కిరీటి బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన పారా కిరీటీ పేరు మీద.. ఆయన కుమారుడు అక్రమంగా పెన్షన్ డబ్బులు డ్రా చేస్తున్నాడని ఆధారాలు సమర్పించారు.
Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
గత 12 సంవత్సరాల నుంచి సుమారు రూ. 4 లక్షలు పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కాజేశాడని.. కిరీటి కుమారుడిపై జాయింట్ కలెక్టర్కు కిరీటీ బంధువులు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనను తెలుసుకొని పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని.. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!