Home
Ap Govt
Ap Govt News
-
Anagani Satyaprasad: మైనారిటీలకు జగన్ చేసిందేంటి?
సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. వైసీపీ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం. టీడీపీ హయాంలో మైనారిటీల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు ఆపేయడం దారుణం అన్నారు. నిలిపేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలి. ముస్లిం సోదరులకు సంక్షేమం అందించడంలో వివక్ష ఎందుకు? ప్రభుత్వ చర్యలతో మరింత పేదరికంలోకి మైనారిటీలు వెళ్లిపోతున్నారన్నారు. వైసీపీ పాలనతో మైనారిటీలకు ఒరిగిందేమిటి? టీడీపీ హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడేశారన్నారు.… -
Swaroopananda: ప్రభుత్వ నిర్ణయంపై స్వరూపానంద హర్షం
ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు… -
Vakula matha Temple: వకుళామాత ఆలయ ప్రారంభానికి జగన్కి ఆహ్వానం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 న అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు… -
Chandrababu: తప్పుచేసినవారు తగిన మూల్యం చెల్లించుకోవాలి
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల… -
Atmakur Bypoll: వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.… -
AP Film Chamber: టికెట్ల అమ్మకాలు, ఆదాయంపై ఏపీ సీఎంకి లేఖ
ఏపీ లో సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఏపీ ఫిలిం ఛాంబర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖ లో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఆన్లైన్ టికెట్ సదుపాయం ను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఇస్తామని లేఖలో వివరించింది.… -
Purandeswari: ఆంధ్రాలో అభివృద్ధి ఎక్కడ?
ఏపీలో బీజేపీ నేతలు అధికారపార్టీపై దాడి ముమ్మరం చేశారు. ఆత్మకూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని వైసీపీ వమ్ము చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిఉన్నా…రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు… -
Indrakeeladri Sarees: చీరల గోల్ మాల్ వ్యవహారం.. మళ్ళీ తెరమీదకు
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ఉత్సవాలు జరిగినా.. ఏదో ఒక అలజడి, వివాదం రేగుతూనే వుంటుంది. ఇంద్రకీలాద్రి పై మళ్లీ చీరాల గోల్ మాల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఏడాది కనిపించకుండా పోయిన అమ్మవారి చీరాల లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర ఆడిట్ అధికారులు అడగడంతో ఇంద్రకీలాద్రి అధికారులు ఈ వ్యవహారం కాస్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది కూడా కనిపించకుండా పోయిన చీరాల… -
Vengamamba Utsavalu: 19 నుంచి 23 వరకూ నర్రవాడ వెంగమాంబ ఉత్సవాలు
మెట్ట ప్రాంత ఆరోగ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు వస్తారని ఉద్దేశంతో ముందస్తుగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్యంగా ఐదు రోజుల పాటు జరిగే వెంగమాంబ… -
Somireddy Chadramohan: ఉచిత పంటల బీమా నవ్వులాటగా మారింది
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!