Kanna Laxminarayana: మోడీ పథకాలకు జగన్ స్టిక్కర్ మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆత్మకూరులో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అప్పుల మీదే పరిపాలన జరుగుతుంది. అవగాహనా రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ఒక ప్రైవేట్ కంపెనీ అన్నారు.
మోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే జగన్ కేవలం నవరత్నాల పేరిట స్టిక్కర్ మార్చుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అథోగతి పరిపాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. నరేంద్ర మోడీ అన్నీ ఆలోచించే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. కొన్ని విద్రోహశక్తులు విధ్వంసం సృష్టించాయని మండిపడ్డారు.
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
బీజేపీ నేత చందు సాంబశివరావు మాట్లాడుతూ.. ఆర్మీలో రిక్రూట్ మెంట్ చేసుకోవడం ఈ రోజే కొత్త కాదు. దేశ జనాభా ప్రాతిపదికన యువతకు అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.సైనిక దళాల్లో ఖాళీల భర్తీ కోసం అగ్ని పథ్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.యేడాదికి 40-50వేల మందిని తీసుకుని యువతకు అవకాశం కల్పించాలని భావించారు.
నాలుగేళ్ళ తర్వాత 25శాతాన్ని సైన్యంలోకి తీసుకుని.. మిగతా 75 శాతాన్ని ఇతర భద్రతా విభాగాల్లో ప్రైవేటుగా సేవలు వినియోగించాలని నిర్ణయించారు.ఈ విధానం పలు దేశాల్లో ఇప్పటికే అమలవుతుంది.నాలుగేళ్ల తర్వాత కూడా మిలటరీలోని పని చేస్తామని పట్టుదల ఉన్నవారిని ఎంపిక చేస్తారు.అగ్నిపథ్ కింద ఎంపికైన వారికి నెల జీతం కింద నాలుగేళ్లకు రూ. 7.50 లక్షలు.. బయటకు వచ్చే సమయంలో మరో రూ. 12లక్షలు ఇవ్వనున్నారు.
అగ్ని పథ్ పధకాన్ని విమర్శించడానికి సరైన కారణాలు ఏమీ లేవు.మోడీ నేతృత్వంలో చేసిన మంచి ఆలోచనను అల్లర్లు ప్రేరేపించే విధంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.సికింద్రాబాదులో ఈరోజు జరిగిన విధ్వంసం వెనుక ఎవరున్నారో త్వరలోనే తెలుస్తుంది.నాలుగు రోజులుగా ప్లాన్ చేసి అల్లర్లు ప్రేరేపించేవిధంగా చేసిన కుట్రలో భాగమే ఈ విధ్వంసం అన్నారు చందు సాంబశివరావు. అంతమంది యువకులు వచ్చి ఒకేసారి యుద్దవాతావరణం సృష్టించారు.
వారి వెనుక ఎవరో ఉండి ప్రోత్సహించబట్టే.. ఇంత అలజడి జరిగింది. 23 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాక ఎవరికీ అభ్యంతరాలు లేవు ..? ఆందోళనకారులకు అసలు వాస్తవాలు కూడా తెలియవు. కొన్ని పార్టీల నేతలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారు. రైళ్లను తగులబెట్టి.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.
నిజంగా సైన్యంలో చేరాలనుకునే యువత ఎవరూ ఇలాంటి దాడులు చేయరు. యువత ముసుగులో రైల్వేస్టేషన్లో గందరగోళం సృష్టించిన వారి వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి.కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి.ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేస్తే.. ప్రజలపైనే భారం పడుతుంది.యువత సంయమనంతో ఉండండి.. తొందరపాటు చర్యలకు పాల్పడవద్దన్నారు.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!