ఏపీలో బార్ ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లైసెన్సుల పొడిగించిన కాలానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిది ప్రభుత్వం. జూన్ 27 తేదీలో నిర్దేశిత లైసెన్సు…
ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…
ఏపీలో వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆత్మకూరులో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అప్పుల మీదే పరిపాలన జరుగుతుంది. అవగాహనా రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ఒక ప్రైవేట్ కంపెనీ అన్నారు. మోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే జగన్ కేవలం నవరత్నాల పేరిట స్టిక్కర్ మార్చుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు…
నిరుద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు ఊరట నిచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు జగన్. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి.…
ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…
ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని…
Nakka Anandababu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఇరు పార్టీల నేతలు ఎక్కడో చోట విమర్శలు చేసుకుంటూనే వున్నారు. దళిత వర్గాలపై జగన్ పార్టీది కపట ప్రేమ అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడింది.. అది దొంగ సస్పెన్షన్. గడప గడపకు…
కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప…
ఏపీలో ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కొన శశిధర్ పై మండిపడింది. కర్నూలులో ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై అధికారులను నిలదీసింది హైకోర్టు. ఆ కుటుంబానికి ఎవరు ఆసరా కల్పిస్తారని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్. అన్ని ఆర్డర్స్లో కోర్టు…
పెగాసెస్ పై అసెంబ్లీ హౌస్ కమిటీ తొలి సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చట్ట విరుద్ధంగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చిలో హౌస్ కమిటీ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం అయింది హౌస్ కమిటీ. రేపు హోం తదితర శాఖల అధికారులతో సమావేశం కానుంది హౌస్ కమిటీ. టీడీపీ హయాంలో పెగాసెస్ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన…