Nara Lokesh Urges Youth to Prepare For Govt Job: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని…
AP Job Calendar 2026 Released By Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించగా.. వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఉగాది పర్వదినాన మంత్రి నారా లోకేశ్ ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్లో పాఠశాల మరియు ఇంటర్…
కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. బడ్జెట్లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని విరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పిందని పేర్కొన్నారు. తాము ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. సమావేశం ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంతో ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. మొదటి రోజు సమావేశంలో ప్రధానంగా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు, జిల్లాల వారీగా నిర్ణయించిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగునీటి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బందికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ‘లస్కర్ల’ దశాబ్దాల కష్టాన్ని గుర్తించి.. వారి రోజువారీ వేతనాన్ని భారీగా పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరికి అందుతున్న అరకొర వేతనాల స్థానంలో.. గౌరవప్రదమైన జీతభత్యాలను కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జీతాల పెంపు వివరాలు.. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం.. ఇప్పటివరకు…
Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారికి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు.
MLC Anantha Babu: NTV ఛానల్ తో ఎమ్మెల్సీ అనంత బాబు మాట్లాడుతూ.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నా భార్యను అన్యాయంగా ఇరికించారు అని పేర్కొన్నారు. నేను పరారీలో లేనని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
Bolisetty Satyanarayana: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పని చేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.
YS Jagan: గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు.. మీరు పాలించడానికి అర్హులేనా?.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని ప్రశ్నించారు.