కరోనా మహమ్మారి ఎంట్రీ అయిన తర్వాత ప్రతీరోజు కరోనా కేసులు, రికవరీ కేసులు, యాక్టివ్ కేసులు.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా పూర్తి వివరాలు వెల్లడిస్తూ వస్తుంది వైద్య ఆరోగ్యశాఖ.. ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు నమోదైన వివరాలను బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ వస్తోంది.. అయితే, ఇవాళ్టి నుంచి కరోనా బులెటిన్ ఇవ్వకూడదని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది… Read…
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే.. మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Read Also: IMD: వాతావరణశాఖ చల్లని…
ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి జనరేటర్లు ఆన్చేశాం అంటారని… తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేశామంటున్నారని.. ఇదంతా ఎంటర్టైన్మెంట్కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని అశోక్ గజపతిరాజు…
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కాగా…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి…
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణలో ఇవాళ్టితో పాఠశాలలు ముగిసాయి.. రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది సర్కార్.. జూన్ 13వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి.. ఇక, ఏపీ సర్కార్ కూడా సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది.. మే 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయంటూ ఆదేశాలు జారీ చేశారు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్… వచ్చే నెల 4వ తేదీలోగా 1-10 తరగతుల్లో అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి…
ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్ధిదారుల ఇష్టమని తెలిపింది.. అయితే, ఇప్పుడు నగదు బదిలీని వాయిదా వేసినట్టు తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి.. 26 జిల్లాల జేసీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు వెల్లడించారు.. యాప్లో సాంకేతిక లోపం…
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మళ్లీ ఆయన్ను సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లు భావించొచ్చు. కాగా టీడీపీ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణల…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రేషన్ బియ్యం బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంలో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలాడుతోందంటూ మండిపడ్డారు. నగదు బదిలీ విషయంలో ప్రజలపై బలవంతంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని విమర్శలు చేశారు. ఈ అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు…