Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా రూ.20వేలు డిమాండ్ చేసింది. దీంతో జయశివ అనే బాలుడి మృతదేహాన్ని తరలించడానికి భారీ స్థాయిలో నగదును డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్లు.. ప్రైవేట్ అంబులెన్స్ను ఆస్పత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బైక్పైనే బాలుడి మృతదేహాన్ని తరలించారు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపలా కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని అంబులెన్స్ డ్రైవర్లను వేడుకున్నా వారు కనికరించలేదు.
Also Read
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు. మృతదేహాల విషయంలో వ్యాపారం చేసే దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి రజినీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!