Chandrababu: జగన్ ప్రభుత్వం అసమర్థతకు పోలవరం ప్రాజెక్టు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెకును జగన్ నాశనం చేశారన్నారు. డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా టీడీపీపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి.. విదేశీ విద్య వరకు టీడీపీ తెచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ రోజు ప్రజలు ఫలితాలు చూస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బడుగు, బలహీనవర్గాలకు జగన్ చేసిందేమీ లేకున్నా.. వారిని రాజకీయంగా వాడుకుంటూ టీడీపీపై వ్యతిరేకత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమం చేసినందుకు.. నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదనేలా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడమేంటని నిలదీశారు. స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు చోరీ చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందని చంద్రబాబు తెలిపారు. నేరస్తులకు కొత్త కొత్తగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం మార్గాలు చూపిస్తోందన్నారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
కాగా టీడీపీ మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలని ముఖ్య నేతలకు చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం… గ్రామ స్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమన్నారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోటీసులతో వేధించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
Somu Veerraju: టీచర్లకు వేసవికాలంలో కాకుండా వర్షాకాలంలో సెలవులు ఇస్తారా?
తాజావార్తలు
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..