Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ‘కులం’ వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగా మారాయి. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.
Caste Row: లోక్సభ వేదికగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ‘కులం’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీని కులగణన డిమాండ్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్తో పాటు దాని మిత్ర పక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్కి ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచారు.
Modi 3.0 Cabinet: లోక్సభ ఎన్ని్కల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించింది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈ రోజు ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా తన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, సీషెల్స్, మారిషన్ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే మోడీ కేబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలకు కాల్స్ వెళ్లాయి. వీరంతా…
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ…
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు నేతలు ( సచిన్ పైలట్ ) పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీకి నేతలు షాకులిస్తున్నారు. ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కమలం గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన.. బీజేపీలోకి చేరిపోయారు.
Farmers : పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుల కోసం పెద్ద ప్రకటన చేసింది.