Anurag Thakur: ఈడీ, సీబీఐతో మా పార్టీకి సంబంధం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతిపరుడని దేశంలో ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు అని ఆయన తెలిపారు. ఇక, 2013లో ఢిల్లీ సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. కాంగ్రెస్తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనన్నారు.. ఆప్, కాంగ్రెస్ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదన్నారు. ప్రతి రోజు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తారు.. వాళ్లు మోడీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Also Read
- CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ఇక, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.. ఎందుకు హాజరు కాలేదు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మళ్లీ విలువల గురించి వాళ్లు మాట్లాడతారు.. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరు కాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి పోయింది.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేదు.. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్క సీటు గెలుచుకోదు.. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ విలువల గురించి మాట్లాడటం దారుణం అన్నారు. ఇక, ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
Read Also: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
అయితే, ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే.. ఎందుకు ఆ కూటమి పేరు మార్చారు? అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ 2జీ, సబ్మెరైన్, బోగ్గు కుంభకోణాలు చేశారు అని ఆరోపించారు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్ యాదవ్ను సైతం కూటమిలోకి చేర్చుకున్నారు.. జైలుకు వెళ్లిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇండియా కూటమిలో ఉన్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!