Sukhvinder Sukhu: అగ్నివీర్ పథకం వల్ల యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి కోల్పోతున్నారు.. ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు.
ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. హమీర్పూర్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని., క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవలి ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసిందని, పాత పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరించిందని ఆయన తెలిపారు.
Also Read
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
మరోవైపు., కేంద్రం యొక్క అగ్నివీర్ పథకాన్ని విమర్శిస్తూ.. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న బీజేపీ యొక్క అగ్నివీర్ పథకం కారణంగా దేశానికి సేవ చేయడంలో యువతలో ఇప్పుడు తక్కువ ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మలికోర్జన్ ఖర్గేతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల నుండి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని, జూన్ 1 న జరగబోయే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఉప ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తమను తాము అమ్మేసుకున్న 6 మంది కాంగ్రెస్ తిరుగుబాటుదారులకు టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అధికార ఆకలితో ఉన్న పార్టీ ప్రయత్నించినందుకు నిదర్శనమని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?