Sukhvinder Sukhu: అగ్నివీర్ పథకం వల్ల యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి కోల్పోతున్నారు.. ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు.
ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. హమీర్పూర్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని., క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవలి ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసిందని, పాత పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరించిందని ఆయన తెలిపారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు., కేంద్రం యొక్క అగ్నివీర్ పథకాన్ని విమర్శిస్తూ.. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న బీజేపీ యొక్క అగ్నివీర్ పథకం కారణంగా దేశానికి సేవ చేయడంలో యువతలో ఇప్పుడు తక్కువ ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మలికోర్జన్ ఖర్గేతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల నుండి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని, జూన్ 1 న జరగబోయే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఉప ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తమను తాము అమ్మేసుకున్న 6 మంది కాంగ్రెస్ తిరుగుబాటుదారులకు టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అధికార ఆకలితో ఉన్న పార్టీ ప్రయత్నించినందుకు నిదర్శనమని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!