Amit Shah: బీజేపీకి 400 స్థానాలు.. కాంగ్రెస్ 40 సీట్లే వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక, భారత కూటమికి ప్రధాని పదవికి అభ్యర్థి లేరని అన్నారు. విపక్ష కూటమిలో ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధానిగా ఉంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ప్రభుత్వం ఇలాగే నడుస్తుందా అని షా ప్రశ్నించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదు అని అమిత్ షా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 కంటే తక్కువ సీట్లు గెలుకుంటుంది.. కానీ, ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధించబోతుందన్నారు.
Read Also: Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ఈ ఎన్నికల్లో ఓ వైపు 6 నెలలకోసారి సెలబ్రేషన్స్ చేసుకునే రాహుల్ బాబా.. మరోవైపు గత 23 ఏళ్లుగా దీపావళికి కూడా సరిహద్దుల్లో సైనికులతో మిఠాయిలు తింటున్న నరేంద్ర మోడీ ఉన్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు రెండు రకాల ఉదాహరణలున్నాయని చెప్పుకొచ్చారు. రాహుల్, అతని సోదరి సెలవుల కోసం సిమ్లాకు వస్తారు.. కానీ, అయోధ్యకు రారు అని ఆయన అన్నారు. కేవలం, ఓటు బ్యాంకుకు భయపడి అయోధ్యలోని రామమందిరానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు.
Read Also: Rain Alert : కేదార్నాథ్, యమునోత్రి, చార్ ధామ్ లో భారీ వర్షం.. భక్తులకు హెచ్చరిక
ఇక, పీఓకే విషయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై కూడా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలు మమ్మల్ని భయపెడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్లో అణుబాంబు ఉందని మమ్మల్ని వాళ్లు భయపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మేము (బీజేపీ) అణుబాంబుకు భయపడమన్నారు. POK భారతదేశానికి చెందినది.. దాన్ని తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాని అమిత్ షా వెల్లడించారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..