Amit Shah: బీజేపీకి 400 స్థానాలు.. కాంగ్రెస్ 40 సీట్లే వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక, భారత కూటమికి ప్రధాని పదవికి అభ్యర్థి లేరని అన్నారు. విపక్ష కూటమిలో ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధానిగా ఉంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ప్రభుత్వం ఇలాగే నడుస్తుందా అని షా ప్రశ్నించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదు అని అమిత్ షా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 కంటే తక్కువ సీట్లు గెలుకుంటుంది.. కానీ, ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధించబోతుందన్నారు.
Read Also: Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ఈ ఎన్నికల్లో ఓ వైపు 6 నెలలకోసారి సెలబ్రేషన్స్ చేసుకునే రాహుల్ బాబా.. మరోవైపు గత 23 ఏళ్లుగా దీపావళికి కూడా సరిహద్దుల్లో సైనికులతో మిఠాయిలు తింటున్న నరేంద్ర మోడీ ఉన్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు రెండు రకాల ఉదాహరణలున్నాయని చెప్పుకొచ్చారు. రాహుల్, అతని సోదరి సెలవుల కోసం సిమ్లాకు వస్తారు.. కానీ, అయోధ్యకు రారు అని ఆయన అన్నారు. కేవలం, ఓటు బ్యాంకుకు భయపడి అయోధ్యలోని రామమందిరానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు.
Read Also: Rain Alert : కేదార్నాథ్, యమునోత్రి, చార్ ధామ్ లో భారీ వర్షం.. భక్తులకు హెచ్చరిక
ఇక, పీఓకే విషయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై కూడా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలు మమ్మల్ని భయపెడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్లో అణుబాంబు ఉందని మమ్మల్ని వాళ్లు భయపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మేము (బీజేపీ) అణుబాంబుకు భయపడమన్నారు. POK భారతదేశానికి చెందినది.. దాన్ని తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాని అమిత్ షా వెల్లడించారు.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!