Modi 3.0 Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్లో దక్కని చోటు..?
Modi 3.0 Cabinet: లోక్సభ ఎన్ని్కల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించింది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈ రోజు ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా తన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, సీషెల్స్, మారిషన్ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే మోడీ కేబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలకు కాల్స్ వెళ్లాయి. వీరంతా ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, జేడీయూ, శివసేన పార్టీలకు కూడా కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పలువురు బీజేపీ నాయకులకు ఈ సారి మొండిచేయి చూపించారు.
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈ సారి మంత్రి పదవులు దక్కవని సమాచారం. స్మృతీ ఇరానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో త్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఈ సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. గతంలో మోడీ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్కి కూడా ఈ సారి మంత్రి పదవి దక్కదని తెలుస్తోంది. ప్రధాని మోడీ రెండో టర్మ్లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు మరియు సమాచార మరియు ప్రసార శాఖలను నిర్వహించారు. ఇక మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రత్నగిరి-సింధు దుర్గ్ నుంచి విజయం సాధించిన నారాయణ రాణేకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫామ్ కాలేదని సమచారం. గతంలో ఈయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.
ప్రస్తుతం మోడీ 3.0 కేబినెట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు , CR పాటిల్, L మురుగన్, హర్దీప్ పూరి, ML ఖట్టర్, శివరాజ్ చౌహాన్, గజేంద్ర షెకావత్, సురేష్ గోపి, మరియు జితిన్ ప్రసాదలకు మంత్రి పదవులు దక్కతున్నట్లు సమచారం. ఎన్డీయేలోని ఇతర నేతలైన హెచ్డి కుమారస్వామి, జయంత్ చౌదరి, ప్రతాప్ జాదవ్, రామ్ మోహన్ నాయుడు, సుదేశ్ మహతో మరియు లల్లన్ సింగ్లకు మంత్రి పదవులు దక్కుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?