యూరియా కొరత, రైతు సమస్యలపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో ఆందోళన చేపట్టింది. పార్టీ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందిని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఆంక్షలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రైతులు భారీగా తరలి వచ్చారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతుల…
ఆ ఏపీ మంత్రులు ఇద్దరూ.... తమ జిల్లాను పూర్తిగా గాలికొదిలేశారా? ప్రతిక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి భయపడుతున్నారా? వాళ్ళు రెచ్చిపోతున్నా... వీళ్ళు కామ్గా ఉండటం వెనక వేరే లెక్కలున్నాయా? ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఎందుకు వాళ్ళలో స్పందనలు కరవయ్యాయి?
క్షవరం అయితేగానీ... వివరం తెలీదంటారు. ఆ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్కు ఈ సామెత సరిగ్గా అతికినట్టు సరిపోయిందా? ఆయనకా క్షవరం కూడా అట్టా ఇట్టా కాకుండా.... మాడు మంటపుట్టేలా.... ఇక నాకొద్దు బాబోయ్, నన్నొదిలేయండ్రా నాయనోయ్... అంటూ గావు కేకలు పెట్టేలా అయ్యిందా? అందుకే మీకు, మీ రాజకీయాలకో దండంరా బాబూ... అంటూ సాష్టాంగ నమస్కారం పెట్టిమరీ చెబుతున్నారా? అంతలా తత్వం బోథపడ్డ ఆ నటుడు ఎవరు? ఏంటా దండాల కథ?
జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నారా? ఒకప్పటి ఆయన అస్త్రమే ఇప్పుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? పవన్ చేతల మనిషి కాదు, ఉత్తి మాటల మనిషేనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏ విషయంలో పవన్ ఇరుకున పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు? ఏ విషయం మిస్ఫైర్ అవుతోంది? ఉప ముఖ్యమంత్రి ఎలా ఇరుకునపడుతున్నారు?
కేటీఆర్ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్ను కలిశానన్న ఆయన.. కేటీఆర్ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. టమోటా చెట్టునుండి తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి రైతన్నకు ఏర్పడింది. ఉంటే అతివృష్టి.. లేదంటే అనావృష్టిలా మారింది టమోటా ధరల పరిస్థితి.మూడు నెలల క్రితం సెంచరీ దాటిన టమోటా ధరలు ప్రస్తుతం కిలో కనీసం 5 కూడా పలకడం లేదు.అధిక దిగుబడి నేపథ్యంలో పంటను రైతులు ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ....
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.