చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది. అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. కనీసం మాటలు కూడా రాని స్థితిలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. గతంలో చంద్రబాబును ఆ స్థితిలో ఎప్పుడూ చూడని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం చూసి ఓ చిన్నారి కూడా ఏడ్వడం ఆ వీడియోలో కనిపించింది. Read…
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.…
ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 25,197 శాంపిల్స్ను పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 196 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,54,125 కు చేరింది.. మొత్తం…
చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు…
కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు. Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు…
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…