చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు అధికారులు. పూర్వం వున్న సప్లైయ్ చానల్ పున:రుద్దరించి… ప్రవాహాన్ని తుమ్మలగుంట ,అవిలాల చెరువుకు మల్లించాలంటున్నారు గ్రామస్థులు.