ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 25,197 శాంపిల్స్ను పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 196 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,54,125 కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,070 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,54,252 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,392 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,426కు పెరిగింది.