ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసింది. రాజధానల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజుకు మంచి ఫలితాలు ఉండేవని, నాటి శ్రీభాగ్ ఒడంబడిక స్పూర్తితో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ది చెందాలన్న అకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. Read: అన్ని సంస్థలు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది…
సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని మంత్రి బుగ్గన అన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని, దాన్ని వృధా చేయవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థలు వస్తే ప్రవేట్ సంస్థలు వస్తాయని, ఏ రాష్ట్రమైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాయని అన్నారు. Read: అభివృద్ధి వికేంద్రీకరణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ…
అమరావతి : సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించింది ప్రభుత్వం. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును పెట్టారు మంత్రి బుగ్గన. ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు…
రాయల చెరువుకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. చెరువుకు ఉత్తర భాగాన వాటర్ లీకేజీతో మరో గండి ఏర్పడింది గండి పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు లీకేజీతో 20 గ్రామాలకు ముప్పు ప్రమాదం ఉంది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 0.6 టీఎంసీల కాగా, ప్రస్తుతం చెరువులో 0.9 టీఎంసీల నీరు ఉంది.నిన్నటి నుంచి దాదాపు 20వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు అధికారులు. దగ్గరుండి ఏర్పాట్లు…
ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనుండగా… మూడు మండలాల్లో ఎంపీపీ, 6 మండలాల్లో మండల ఉపాధ్సక్ష పదవులకు ఎన్నిక చేపట్టనున్నారు అధికారులు. ఇక విజయనగరం జెడ్పీ ఉపాధ్యక్ష పదవికి నేడే ఎన్నిక జరగనుంది. మొత్తం 130 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికలో కొండపల్లి…
తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి…
ఏపీలో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,659 శాంపిల్స్ పరీక్షించగా.. 174 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఎవరు మరణించలేదు. ఇక, ఇదే సమయంలో 301 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,78,784 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244…