ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 25,197 శాంపిల్స్ను పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 196 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,54,125 కు చేరింది.. మొత్తం…
చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు…
కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు. Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు…
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో నందమూరి కళ్యాణ్రామ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది…
చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు.…
ఏపీ మహిళా మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు, శివానంద మఠానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో కొంతమంది దాతలు 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయం నిర్మించేందుకు మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంకుస్థాపనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also:…
శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు. Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని ‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.…