ఏపీలో న్యాయపరమైన వ్యవహరాలపై జస్టిస్ చంద్రు కీలక కామెంట్లు చేశారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని…హైకోర్టు తీర్పు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని చట్టాలను ఉపసంహరించుకుందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కోర్టులను ఎదుర్కొలేక చట్టాన్ని ఉప సంహరించు కుందని…ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని వెల్లడించారు. విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములున్నాయని ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.. ఆ జడ్జీలు…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి… బాపట్ల ఎంపీ నందిగాం సురేష్కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సదరు ఎంపీపై బెదిరింపులకు దిగాడు.. దీంతో.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ… ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన తుల్లూరు పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా కూలిలాగడంతో.. ఫోన్ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబూరావును అదుపులోకి తీసుకుని…
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ… లక్ష్మీనారాయణ ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహించింది ఏపీ సీఐడీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడంతో.. ఇవాళ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.. Read Also: శ్రీవారి…
కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తిరుపతి వెళ్లామంటే.. వెంటనే లడ్డూ తెచ్చారని అడుగుతుంటారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ, తెలంగాణలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.. మరోవైపు.. శ్రీనివాసమంగాపురంలోనూ లడ్డూ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది టీటీడీ.. రేపటి నుంచి శ్రీనివాసమంగాపురంలో లడ్డూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలను…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సిద్దమైంది. దీనిపై అటు కేంద్రకేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయో అప్పటి నుంచే ఉక్కుకార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, దీక్షలు, పోరాటాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు కార్మికులకు మద్దతు తెలిపారు. Read: వావ్: రెండే…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,793 శాంపిల్స్ పరీక్షించగా.. 142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,15,406 కు చేరుకోగా……
ప్రస్తుతం విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాల్లోని ఏ పల్లెకు వెళ్లినా తగలబడుతున్న గంజాయి కుప్పలే కనిపిస్తాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ఫలితాలు ఇస్తోంది. వేలాది ఎకరాలలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. 214 కేసులు బుక్కయ్యాయి. 546 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా వాహనాలను సీజ్ చేశారు. వైజాగ్ ఏజెన్సీ, ఏవోబీలో దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగవుతోంది. ఎకరాకు 1000…
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్గా గుజరాత్లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు…
కేజీహెచ్ లో సమ్మెబాట పట్టారు జూడాలు. గుంటూరులో డాక్టర్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగ్గారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం దారుణం అంటూ తెలిపారు. మా సేవలను గుర్తించక పోయినా పర్లేదు కానీ దాడులు చేయడం ఘోరం. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. కానీ ఇప్పుడు వరసగ వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి. మాకు రక్షణ లేకుండా పోయింది, మాకు…
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25…