Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Minister Botsa: ఏపీకి ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉన్నాం
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెప్తున్నారని బొత్స ఆరోపించారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఇది దుర్మార్గపు ఆలోచనగా బొత్స విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా క్రీములు, పౌడర్ల… -
Konaseema: అమలాపురంలో మరో వారం పాటు 144 సెక్షన్
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన 144 సెక్షన్ను మరో వారం రోజులు పొడిగించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కూడా మరో 24 గంటల పాటు పొడిగించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. Konaseema Riots:… -
Tammineni Sitaram: టీడీపీ చేసేది మహానాడు కాదు.. వల్లకాడు
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు… -
Chintamaneni Prabhakar: వైసీపీ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణముప్పు ఉంది
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. Three Gorges… -
YSRCP: రెండోరోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభం
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ… -
Bank Robbery: శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ బ్యాంకులో భారీ దోపిడీ
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ ఏపీలో నేడు, రేపు తెలుగుదేశం ‘మహానాడు’ కార్యక్రమం.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు ★ నేడు విశాఖ, తూ.గో. జిల్లాలలో వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ★ కోనసీమలో వరుసగా మూడోరోజు ఇంటర్నెట్ బంద్.. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ★ సత్యసాయి జిల్లా: నేడు హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన ★ నెల్లూరు జిల్లా: నేడు మనుబోలులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… -
Andhra Pradesh: ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్ ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్-2021’ అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ వెల్లడించారు. Kodali Nani: చంద్రబాబు-పవన్ కలయిక.. ఏపీకి పట్టిన దరిద్రం కాగా గ్రామీణాభివృద్ధి… -
Kodali Nani: చంద్రబాబు-పవన్ కలయిక.. ఏపీకి పట్టిన దరిద్రం
పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు.… -
Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో…
తాజావార్తలు
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!