ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ కూలీల చెల్లింపుల నిమిత్తం రూ. 685.12 కోట్ల మేర నిధులను విడుదల చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్ల జమ కాబోతున్నాయి. ఇక, గత రెండు రోజులుగా రూ. 302.96 కోట్ల మేర కూలీలకు చెల్లింపులు చేసింది ప్రభుత్వం.. వచ్చే రెండు-మూడు రోజుల్లో రూ. 319 కోట్లను కూలీల ఖాతాల్లో జమ చేయనున్నట్టు పంచాయతీ రాజ్ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. కాగా, కేంద్రం నుంచి ఉపాధిహామీ పథకం కింద వస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లీస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి.. దీంతో, పని చేస్తున్న కూలీలకు నిధులు సకాలంలో అందడంలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేయడం.. కూలీలకు కూడా డబ్బులు పంపిణీ చేస్తోంది సర్కార్.
Read Also: AP SEC: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా..