ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఈ సారి రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రేపు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక, ఇవాళ మొదట శ్రీకాకుళం వెళ్లనున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హస్తినకు వెళ్తారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే స్పీకర్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ఆముదాలవలస వెళ్లనున్నారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు. అయితే, సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధిస్తారని, కర్ఫ్యూ ప్రకటిస్తారనే ప్రచారం సాగింది.. ఆ వార్తలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆముదాలవలసకు రేపు 3.20 గంటలకు వస్తారు.. 10 నిమిషాల పాటు ప్రజలతో మమేకం అవుతారని.. సాయంత్రం 4.15 గంటల…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఎంపీ మాధవ్కు సంబంధించినదంటూ ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇక, దానిపై స్పందించిన వైసీపీ ఎంపీ.. అది మార్ఫింగ్ చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు.. వారే కుట్రపూరితంగా నా ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
AndhraPradesh-BalKrishna: విద్యుత్ వాహనాల రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రానున్న కొన్నేళ్లలో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లైట్ హౌజ్ స్టేట్గా నిలవాలని ఆకాంక్షిస్తోంది. ఈ దిశగా ఇవాళంతా కీలక సమావేశం నిర్వహిస్తోంది.
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుంది.. వీడియో వాస్తవమని తేలితే …ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి..
శ్రీశైలం ప్రాజెక్టులో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
* కామన్వెల్త్ గేమ్స్లో దూసుకెళ్తోన్న భారత్… ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు.. అందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు * నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్న కాంగ్రెస్ * ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు.. తెలంగాణలోని గోల్కొండ,…