Social Media Fake Posts: టీడీపీపై తప్పుడు ప్రచారం..! విజయసాయిరెడ్డిపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు..
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు లేఖ రాసిన ఆయన.. లేఖలో.. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నారా లోకేష్పై తప్పుడు ప్రచారం చేశారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుందని.. సామాజిక మాధ్యమాల్లో దేవేందర్రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవు.. వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
Read Also: MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ.. కఠిన చర్యలు తప్పవు..!
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, 3 ఆగస్టు 2022న ఏ2 విజయ సాయి రెడ్డి సైతం టీడీపీ నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.. 3 ఆగస్టు 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సీఐ భూషణంని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని తెలిపారు.. సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి మా నాయకులపై అసభ్యకరంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారని.. ఇప్పటి వరకు మా ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదన్న ఆయన.. అధికార పార్టీ నేతలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఐడీ ఏడీజీకి విజ్ఞప్తి చేశారు వర్ల రామయ్య.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో