కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఏథర్ ఎనర్జీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ – మార్చి 31, 2026 వరకు మాత్రమే (అంటే ఈ నెల చివరి వరకు). ఈ ఆఫర్లు Rizta, 450 సిరీస్ (450S, 450X మొదలైనవి) మీద అందుబాటులో ఉన్నాయి. ఇది PM E-Drive సబ్సిడీ ముగిసే ముందు (మార్చి 31, 2026) కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం.
Also Read:WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ
నివేదికల ప్రకారం, కంపెనీ ఈ నెలలో ఏథర్ స్కూటర్లపై గరిష్టంగా రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఏథర్ స్కూటర్లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు చెల్లుతుంది. రూ.20,000 పొదుపులో రూ.10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ.6,500 క్యాష్ డిస్కౌంట్, రూ.3,500 ఎక్స్టెండెడ్ కాంపోనెంట్ వారంటీ ఉన్నాయి. ఈ తయారీదారు భారతీయ మార్కెట్లో అథర్ రిజ్టా, అథర్ 450X, అథర్ 450 అపెక్స్తో సహా పలు విభాగాలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
Also Read:Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్
ధర ఎంత?
ఏథర్ రిజ్టాను కంపెనీ 1.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తున్నారు. అయితే టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఏథర్ 450 ధర రూ.1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్), అపెక్స్ వెర్షన్ ధర రూ.1.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).