KA Paul: మేం అధికారంలోకి వస్తే మహిళను సీఎం చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం అధికారంలోకి వస్తే ఓ మహిళను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో హడావిడి చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ తరచుగా పర్యటిస్తున్నారు.. వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ.. అధికార, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.. గురువారం అనంతపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక సీఎం వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్కి ప్రజలు అధికారమిచ్చారని.. అప్పులు దొరక్క జగన్ పాలన సరిగా చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.. ఈసారి జగన్కు ఓట్లు పడే అవకాశం లేదని జోస్యం చెప్పిన ఆయన.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావని మండిపడ్డారు.. ఇక, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదన్న పాల్.. పవన్ కల్యాణ్ పులిలాంటి తనతో కలిసి రావాలని కోరారు.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కాలేదు.. కానీ, మేం అధికారంలోకి వస్తే.. మహిళను సీఎం చేస్తామని.. లక్ష కోట్ల రూపాయలు తెస్తానని ప్రకటించారు.
Read Also: Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
కాగా, ఈ మధ్యే రాయలసీమ నేతలపై ఘాటు కామెంట్లు చేశారు పాల్.. రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులని ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి సీఎంగా చేసిన వారంతా రాయలసీమ వాసులేనని గుర్తు చేసిన ఆయన.. మొత్తానికి రాయలసీమను రాక్షససీమగా రాజకీయ నాయకులు మార్చారని మండిపడ్డారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి, వైఎస్ఆర్, వైఎస్ జగన్.. కడప జిల్లా వాళ్లు అని పేర్కొన్న విషయం తెలిసిందే.. అంతేకాదు.. కమ్మ వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతారని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!