KA Paul: మేం అధికారంలోకి వస్తే మహిళను సీఎం చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం అధికారంలోకి వస్తే ఓ మహిళను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో హడావిడి చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ తరచుగా పర్యటిస్తున్నారు.. వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ.. అధికార, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.. గురువారం అనంతపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక సీఎం వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్కి ప్రజలు అధికారమిచ్చారని.. అప్పులు దొరక్క జగన్ పాలన సరిగా చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.. ఈసారి జగన్కు ఓట్లు పడే అవకాశం లేదని జోస్యం చెప్పిన ఆయన.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావని మండిపడ్డారు.. ఇక, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదన్న పాల్.. పవన్ కల్యాణ్ పులిలాంటి తనతో కలిసి రావాలని కోరారు.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కాలేదు.. కానీ, మేం అధికారంలోకి వస్తే.. మహిళను సీఎం చేస్తామని.. లక్ష కోట్ల రూపాయలు తెస్తానని ప్రకటించారు.
Read Also: Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
కాగా, ఈ మధ్యే రాయలసీమ నేతలపై ఘాటు కామెంట్లు చేశారు పాల్.. రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులని ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి సీఎంగా చేసిన వారంతా రాయలసీమ వాసులేనని గుర్తు చేసిన ఆయన.. మొత్తానికి రాయలసీమను రాక్షససీమగా రాజకీయ నాయకులు మార్చారని మండిపడ్డారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి, వైఎస్ఆర్, వైఎస్ జగన్.. కడప జిల్లా వాళ్లు అని పేర్కొన్న విషయం తెలిసిందే.. అంతేకాదు.. కమ్మ వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతారని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!