Srisailam Dam Gates Opened: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది… కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇన్ ఫ్లో రూపంలో 1,08,000 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,00,374 క్యూసెక్కులుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.173 టీఎంసీలుగా ఉంది… ఉంది.. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,78,003 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండగా.. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నిండుకుండలా మారి గరిష్టస్థాయికి చేరింది నీటిమట్టం..
Read Also: RBI circular: అట్లయితే డబ్బులే. బంగారం ఇవ్వం. ఆర్బీఐ సర్క్యులర్.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
ఇక, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం, వరుస సెలవులు కావడంతో.. శ్రీశైలం డ్యామ్ సందర్శనకు క్యూ కడుతున్నారు పర్యాటకులు.. ఇవాళ శ్రావణ శుక్రవారం సెలవు ఉండగా.. ఆ తర్వాత శని, ఆదివారాలే కావడంతో.. క్రమంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి, డ్యామ్ సందర్శనకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేస్తే.. అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. డ్యామ్ నుంచి గేట్ల ద్వారా వచ్చే నీరు.. మళ్లీ పైకి ఎగిసిపడితే.. మనసు పులకించిపోతుంది.. ఇక, ఆ నీటి తుంపర్లు.. ఘాట్ రోడులపై వెళ్తున్న వాహనాలపై కూడా పడుతుంటాయి.. వాటిలో తడిసి ముద్దవ్వడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు.. అందుకే గేట్లు ఎత్తివేసి సమయంలో.. శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.
మరోవైపు.. నాగార్జున సాగర్ డ్యామ్లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,19,763 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వచ్చి చేరుతుండగా.. కుడి కాలువకు 1,969 క్యూసెకులు, ఎడమ కాలువకు 3,490 క్యూసెకులు.. మొత్తంగా 12,104 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు.. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిలువ 240 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 563 అడుగులకు చేరింది.. శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చిచేరుతుండడంతో.. సాగర్లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది జులై నెల నుంచే నాగార్జున సాగర్కు వరద నీరు వచ్చిచేరుతోన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!