India-Iran: సంక్షోభం వేళ భారత్కు శుభవార్త.. ఇరాన్తో ఫలించిన జైశంకర్ దౌత్యం
- సంక్షోభం వేళ భారత్కు శుభవార్త
- ఇరాన్తో ఫలించిన జైశంకర్ దౌత్యం
- ధృవీకరించిన కేంద్ర వర్గాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలను చమురు, గ్యాస్ సంక్షోభం వెంటాడుతోంది. తీవ్ర భయాందోళనలు నెలకొన్న తరుణంలో భారతదేశానికి మంచి శుభవార్త అందింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన దౌత్యం చక్కటి ఫలితాన్ని ఇబ్బంది. దీంతో హార్ముజ్ జలసంధి నుంచి భారత్ చమురు ట్యాంకర్లు బయల్దేరేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం భారత్ ఆయిల్ ట్యాంకర్లు కదిలేందుకు ఇరాన్ మార్గం సుగమం చేసినట్లుగా గురువారం కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామం భారతీయులకు తీపి కబురుగానే చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్న్యూస్.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ పెద్దలతో జరిపిన సంభాషణ తాజాగా సత్ఫలితాన్ని ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత్ చమురు ట్యాంకర్లు జలసంధిని దాటేందుకు ఇరాన్ మార్గం సుగమం చేసింది. అన్ని విధాలుగా రూట్ క్లియర్ చేసినట్లుగా తాజాగా కేంద్ర వర్గాలు పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో శత్రు దేశాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేసింది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్లకు వెళ్లే నౌకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశానికి ఇరాన్ ప్రత్యేక రాయితీని మంజూరు చేసింది. భారత్ ట్యాంకర్లు విడిచి పెట్టేందుకు ఇరాన్ అంగీకరించింది. రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ జరిపిన చర్చల ఫలితంగానే ఇదంతా జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!