రాష్ట్రంలోని పేద వర్గాలకు జరిగిన లబ్ధి గురించి చెప్పేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర చేపట్టినట్టు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యత్రలో ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నేతలు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 1299 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.…
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారికి దిశానిర్దేశం చేశారు.. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం.. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అన్నారు
రానున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. మరోవైపు, పలువురు పార్టీ నియోజకవర్గ నేతలు తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు
మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్నికి కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.. పెనుకొండ బాధ్యతలు తీసుకోవాలని అధిష్టానం నాకు సూచించిందన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకి సంబంధించి ఏఐసీసీ పెద్దలు మా అభిప్రాయం అడిగారని తెలిపారు.. అయితే, షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ కి ఉపయోగం ఉంటుందని అందరం ఏకాభిప్రాయం చెప్పామని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు పళ్లంరాజు
మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి…