Fake Cigarettes Racket: బ్రదర్ జర భద్రం.. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Cigarettes Racket: సిగరెట్ ధరల పెంపుతో నకలీలు మార్కెట్లోకి దిగుతున్నాయి. అచ్చం అసలుకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీలను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు కేటుగాళ్లు. తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు గుర్తుపడుతున్నారు తప్ప.. లేదంటే తెలియడం లేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలో నకిలీ సిగరెట్ల దందా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నకిలీల బెడద ఖమ్మం జిల్లాకు కూడా పాకింది.
సాధారణంగా ప్రముఖ సిగరెట్ల బ్రాండ్లకు సంబంధించి ప్రధాన పట్టణాల్లో డీలర్లు ఉంటారు. కానీ కొందరు వ్యాపారులు రంగ ప్రవేశం చేసి పలు ప్రాంతాల నుంచి నకిలీ సిగరెట్ పెట్టెలను తెచ్చి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అలవాటును ఆసరాగా చేసుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో కొందరు వ్యాపారులు నకిలీ సిగరెట్ల దందాకు తెర తీశారు. కానీ క్షుణ్నంగా పరిశీలిస్తే తప్ప అసలు, నకిలీ సిగరెట్ల మధ్య తేడాను గుర్తించడం సాధ్యం కాదు. బంగ్లాదేశ్ కేంద్రంగా తయారైన నకిలీ సిగరెట్లు హైదరాబాద్కు తరలించి అక్కడి నుంచి వివిధ జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నకిలీ సిగరెట్లు తరలిస్తున్నారు.
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా?
మామూలు సిగరెట్ల కంటే పెట్టె ఒక్కంటికి 20 నుంచి 50 రూపాయలు వరకు తగ్గించి అమ్మడంతో సత్తుపల్లిలో ఉన్న ప్రతి పాన్, బార్ షాపులల్లో అమ్మకాలు చేపడుతున్నారు. అలానే వీ.ఎం.బంజర్లో పలు కిరాణాషాపు నిర్వహకులు నకిలీ సిగరేట్లను అమ్మకాలు చేస్తున్నారు. నకీలి సిగరేట్ ఒక్కొక్కటి తాగే వినియోగదారుడి నుండి గోల్డ్ ఫ్లేక్ లైట్ సిగరేట్ ఒక్కంటికి 25 రూపాయాలు దుకాణాదారులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక్క సిగరేట్ తాగటానికి 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ నకీలీ సిగరేట్స్ వచ్చాక నిమిషంలోపే సిగరేట్ కాలి బుడిద అవుతోందని రెండు,మూడు దమ్ములు పీల్చే వరకు సిగరేట్ అయిపోతుందని వినియోగదారులు చెబుతున్నారు.
సత్తుపల్లిలో ప్రముఖ ఐటీసీ సంస్థ ఏరియా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్న విక్రయదారుడు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని చిన్నచిన్న దుకాణాలకు విక్రయిస్తూ ఉంటారు. ఇటీవల ఐటీసీ సంస్థ చాక్లెట్, బింగో, గోధుమ పిండి, ఆగర్ వత్తులు వంటివి కొనుగోలు చేస్తే దుకాణదారులకు సిగరెట్లు ఎమ్మార్పీకే అందజేస్తామని తెలియజేయడంతో అందుకు దుకాణదారులు నిరాకరించారు. దీంతో సిగరెట్లు ఎమ్మార్పీ కంటే అదనంగా 20 రూపాయాల నుంచి 30 రూపాయాల వరకు వసూలు చేస్తున్నారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సిగరెట్లు రేట్లు పెంచడంతో సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో సిగరెట్ల విక్రయదారులు కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే ఒక్కొక్క పెట్టెపై 20 రూపాయాల నుంచి అత్యధికంగా 50 రూపాయాల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. సాధారణంగా చిన్న గోల్డ్ ఫ్లాక్ ఎమ్మారీ 100 రూపాయాలు ఉండగా 120 రూపాయాలకు అమ్ముతున్నారు. ఇలా ప్రతి సిగరెట్ పెట్టపై 20 రూపాయాల నుంచి 50 రూపాయాల వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
సరికొత్త కలర్ ఆప్షన్లతో KTM 200 Duke, KTM 250 Duke బైక్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
సిగరెట్లు,పాన్ మసాలా, తంబాకు, ఆర్ఆర్, మిరాజ్, విమల్ వంటి విక్రయాలలో ఎక్కువ భాగం కంప్యూటర్ ప్రింట్, జీఎస్టీ, చెల్లించకుండా కేవలం తెల్ల కాగితం పై బిల్లు రసీదులను అందజేసి విక్రయాలు చేపడుతున్నారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నకిలీ సిగరెట్లు.. మరోవైపు ఎమ్మార్సీకి మించి సిగరెట్లు,పాన్ మసాలా, విమల్, ఆర్ఆర్ అమ్మకం ఎటువంటి కంప్యూటర్ బిల్లు ఇవ్వకుండా జీఎస్టీలు ఎగవేస్తూ జీరో దందాకు తెరతీశారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కంపెనీ ప్రతినిధులు సత్తుపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నకిలీ సిగరెట్ల విక్రయాలలో బిల్లు చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించి జీరో దందాకు అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!