Vasantha Krishna Prasad: ఆసక్తిగా మైలవరం రాజకీయం.. మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు సీఎంవో ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్గా సాగుతోంది.. ఈ వ్యవహారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రులు.. ఇలా అందరిలోనూ టెన్షన్ పెడుతోంది.. అయితే, ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎంవో నుంచి మరోసారి ఫోన్ వచ్చిందట.. గతంలో పలుమార్లు ఆయనకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చినా.. ఆయన స్పందించలేదనే ప్రచారం సాగాంది.. అందేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోను అంటూ వైసీపీ అధిష్టానికి ఆయన క్లారిటీగా చెప్పారనే చర్చ కూడా సాగింది..
Read Also: Disease for Women: మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి.. వస్తే జీవితాంతం భరించాల్సిందే?
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
అయితే, మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.. ఈ వ్యవహారం మైలవరం రాజకీయాన్ని హీటెక్కిస్తోంది.. అయితే, సీఎంవో నుంచి కాల్ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయం అని.. లేదా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు అనేది వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది.
Read Also: AUS vs PAK; లిఫ్ట్లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!
కాగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్.. అధిష్టానం నుంచి పిలుపు రాకముందే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.. దీంతో, రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం.. చాలా సార్లు పార్టీ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. సీఎంవోకి రావాలని వసంతకు సమాచారం పంపించారు.. కానీ, ఆయన సీఎంవోకు వెళ్లాల్సిన సమయంలో హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మరోవైపు, వసంత కృష్ణప్రసాద్కు మంత్రి జోగి రమేష్కు చాలా కాలం నుంచి వివాదం నడుస్తూ వచ్చింది.. ఇది పలుమార్లు అధిష్టానం వరకు వెళ్లడం.. వారిని బుజ్జగించి పంపడం కూడా జరిగింది. అయితే, ఈ రోజు సీఎం వైఎస్ జగన్ను ఎమ్మెల్యే వసంత కలవనుండడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?