Ragi Ambali: ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే ‘రాగి అంబలి’.. ఇలా చేస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ambali: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్, జ్యూస్లు తాగుతుంటాం. కానీ, మన పూర్వీకులు వేసవిలో ఒంటిని చల్లబరచడానికి, శరీరానికి అపరిమితమైన శక్తిని ఇవ్వడానికి రాగి అంబలిని వాడేవారని ఎంత మందికి తెలుసు. ముఖ్యంగా పులియబెట్టి చేసే ఈ రాగి అంబలి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియస్తే ఆశ్చర్యపోతారు. ఈ అమృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
రాగి అంబలి తయారీ విధానం:
ఒక మట్టి కుండలో అర కప్పు రాగి పిండి, అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా (కనీసం 8-10 గంటలు) చల్లని ప్రదేశంలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పులిసి ఔషధ గుణాలు వస్తాయి. తర్వాతి రోజు ఉదయం, స్టవ్ మీద కుండలో ఒక లీటర్ నీటిని మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో తిప్పాలి. సన్నటి సెగపై 10-15 నిమిషాల పాటు బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపై స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒక కప్పు పెరుగును సాఫ్ట్గా చిలికి, అందులో 3-4 కప్పుల నీళ్లు పోసి మజ్జిగ తయారు చేయాలి. ఇందులోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచి వేయాలి. అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు (బ్లాక్ సాల్ట్ ఉంటే ఇంకా మంచిది) కలపాలి. చల్లారిన రాగి జావలో, అప్పుడే తయారు చేసుకున్న మజ్జిగను వడకట్టి కలపాలి. చివరగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే అమోఘమైన రాగి అంబలి రెడీ అయిపోతుంది.
అద్భుత ప్రయోజనాలు ఇవే..
* ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
* పిండిని రాత్రంతా పులియబెట్టడం వల్ల ఇందులో పొట్టకు మేలు చేసే ‘గుడ్ బ్యాక్టీరియా’ పెరుగుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
* రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు శరీరానికి ఉక్కు వంటి బలాన్ని ఇస్తాయి.
READ ALSO: Marriage Frauds : హైదరాబాద్లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
తాజావార్తలు
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!