బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా…
టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం…
‘దొరసాని’తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువయ్యారు. ఆయన నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో సినిమా మొదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబి’ చిత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారి సన్నిధానంలో కన్పించారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వారిని శాలువాలు కప్పి సత్కరించారు. విజయ్ దేవరకొండతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. Read Also : “మా” ఎలక్షన్స్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తొలి చిత్రంతోనే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో తనలోని కామెడీ టైమింగ్ ను తెలియచేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం విశేషం. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘పుష్పక విమానం’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్లైన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘చుట్టాలబ్బాయి’తో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్…
ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని పని చేస్తున్నారు. ఈ సినిమాలోని “కళ్యాణం”…
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూడో చిత్రమిది. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత…