చియాన్ విక్రమ్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’తో తమిళనాట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజు ‘మహాన్’ పేరుతో సినిమా తీస్తున్నాడనగానే సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొవిడ్ కారణంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘తప్పు చేయడానికి అనుమతించని స్వాతంత్రం…
నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన…
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పామ్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకూండా భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయని టాక్ నడుస్తోంది. లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి…
కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గత యేడాది అమేజాన్ ప్రైమ్ సంస్థ 13 బిలియన్ డాలర్లు వెచ్చించిందట. ఈ విషయాన్ని ఇటీవల సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి తెలిపారు. పదమూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 96 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం చూస్తే… ఎవరైనా అమ్మో అంటూ ఆశ్చర్యపోక మానరు. కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలా అంటూ చాలామంది నోరు వెళ్ళ బెడతారు.…
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి…
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం…
బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.…
ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ…
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈరోజే తీసుకోండి. లేకపోతే రేపటి నుంచి రూ.500 ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్షిప్ ద్వారా అమెజాన్లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ మూవీస్, ప్రైమ్ మ్యూజిక్ను యాక్సెస్ చేయవచ్చు. కానీ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ధర పెరగనుంది. Read Also: ఫేస్బుక్ నుంచి…
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వైష్ణవ్తేజ్కు జోడీగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించింది. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు ఉద్యోగం…