అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో.…
రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కెజిఎఫ్ 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14 న విడుదలైన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అని లేకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం…
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎన్ని రోజులు ఆడుతుంది.. ఎంతవరకు ప్రేక్షకులను చేరుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్ 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక సినిమా హిట్ టాక్ అందుకుంటే ఓటిటీలో కొన్నిరోజులు ఆలస్యంగా వస్తుంది.. బోల్తా కొడితే కొంచెం ముందుగానే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఇక తాజాగా ఆచార్య పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే .. ఈ సినిమాకు సంబంధించిన ఓటిటీ…
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా కొద్దిగా బెటర్ అనిపించుకున్న ఈ సినిమా పడిజిటల్ ప్రీమియర్ గా రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఇక ఉగాది…
విశ్వనటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అచ్చం మడం నాణం పయిర్పు’. రాజా రామూర్తి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అక్షర హాసన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ” ఈ చిత్రంలో నేను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సామజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటిటీలోకి రానున్నదనే వార్త ప్రస్తుతం నెట్టింట ఓరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ అమెజాన్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.…
అక్కినేని నాగ చైత్నన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో హిట్ ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.. మరోపక్క హిందీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దూత అనే…