US: అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్లో ఉన్నామా..? లేక పాకిస్తాన్లో ఉన్నామా..? అని అనిపిస్తోందని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సామూహిక ఇస్లామిక్ వలసలు మనం ఎంతగానో ప్రేమించే అమెరికాను చంపుతున్నాయని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో, డల్లాస్లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
Read Also: Tata EV Cars Discount: టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్న్యూస్.. ఏకంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు
డల్లాస్ వ్యాప్తంగా మసీదులు పెరుగుతున్నాయని, ఎపిక్ సిటీ కంపౌడ్స్ వంటి పెద్ద ఇస్లామిక్ కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయని, ఇవి మన అమెరికన్ సంస్కృతిని మార్చేస్తో్ందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అక్కడి ముస్లిం సంఘాలు, పాక్ సంతతి డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు గిల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని, ముస్లింలపై తప్పుడు అపోహలు పెంచుతున్నాయని చెబుతున్నారు.
గతంలో కూడా బ్రాండమ్ గిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇస్లాం అమెరికాను నావనం చేయడానకి వచ్చిందని అన్నారు. న్యూయార్క్ నగర మేయర్, భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ తన చేతులతో అన్నం తింటున్న వీడియోపై.. ఇలాంటి వ్యక్తులు అమెరికాకు సరిపోరని, మూడో ప్రపంచ దేశాలకు తిరిగి వెళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. సామూహిక వలసలు అమెరికాను నాశనం చేస్తాయని, భారత్ లాంటి దేశాల నుంచి వలసలు హాని కలిగిస్తాయని అన్నారు. గుజరాతీ వాలీబాల్ ఈవెంట్ పై స్పందిస్తూ.. మనకు కుల వ్యవస్థ లేదు కాబట్టి అమెరికా అవకాశాలకు కేంద్రంగా ఉందని అన్నారు.