Bv Raghavulu: బీజేపీకి ఆదరణ తగ్గుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది.
రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు ఏపీలో రాజకీయ పార్టీలు పరోక్షంగా పని చేస్తున్నాయి. జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్నుంచి మతోన్మాద శక్తులతో కలిసే పని చేస్తుంది. ఇప్పటికైనా అందరూ కలిసి మతోన్మాద శక్తులపై కలిసి పోరాడాలి.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
వైసీపీ, టీడీపీ, జనసేన లౌకిక పార్టీలో కాదో తేల్చుకోవాలి. ఏపీలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపివేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని మేం వ్యతిరేకిస్తున్నాం కేంద్రం ఒత్తిడితో వైసీపీ చాలా ఉత్సాహంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అందరికంటే ముందే ఏపీలో అమలు చేశారు. డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం కేంద్రం ఒత్తిడిలో భాగమే అన్నారు బీవీ రాఘవులు. వైసీపీ ప్రజా పక్షమా..? కేంద్రం పక్షమా..? ఏపీలో విశాలమైన ఉద్యమం చేయకముందే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. రేషనుకు బదులు నగదు బదిలీ పథకానికి ప్రజలెవరూ అంగీకరించొద్దు. రేషన్ నగదు బదిలీకు అనుమతి పత్రాలివ్వొద్దు. కోర్టుల్లో డాక్యుమెంట్లను దొంగిలించడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఎవరిని నిందించాలి.. కోర్టులనా..? ప్రభుత్వాన్నా..? పోలీసులనా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Sai Ganesh: పోస్టుమార్టం చేయకుండా కాలయాపన
కోర్టులో దొంగతనం ఘటన పై ఉన్నత స్థాయి బృందాన్ని వేసి విచారణ చేయించాలి. చోరీ కేసునుపై కోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్షాలు ఐక్యంగా పోరాడుతూనే ఉన్నాయన్నారు బీవీ రాఘవులు. చిన్న చిన్న తేడాలున్నా.. ఐక్యతను కొనసాగించేలా భవిష్యత్తు ప్రణాళికలుంటాయి. అమరావతి విషయంలో గతంలో చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారు. 1500 ఎకరాల్లో త్వరగా భవనాలు పూర్తి చేసి గృహప్రవేశం చేయమని చంద్రబాబుకి ఆనాడే చెప్పాం అన్నారు బీవీ రాఘవులు.
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!