Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?
- నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది
- నర్గీస్ మొహమ్మది ఎవరు?
- 53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు.
Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ
Also Read
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
నర్గీస్ మొహమ్మది ఎవరు?
53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇరాన్లో మహిళలపై అణచివేత. రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందారు.ఇరాన్ అధికారులు ఆమె నిరసనలు చేస్తోందని, రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఆమె, మద్దతుదారులు ఖండిస్తున్నారు, శాంతియుత కార్యకలాపాలకు శిక్షించబడుతున్నారని చెబుతున్నారు.
నర్గీస్ ఒక ఇంజనీర్, రచయిత్రి, అలాగే నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడి స్థాపించిన హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ సెంటర్ (DHRC) ఉపాధ్యక్షురాలు. ఆమె గత దశాబ్దంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపింది. ఈ కొత్త తీర్పుతో ఆమె మొత్తం జైలు శిక్ష 44 సంవత్సరాలకు చేరుకుందని నర్గీస్ ఫౌండేషన్ తెలిపింది. 2021 నుండి, ఆమె జాతీయ భద్రతా ఆరోపణలపై 13 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తోంది.
Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ, అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినందుకు గాను ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె టెహ్రాన్లో జైలులో ఉన్నప్పుడు ఆమె పిల్లలు ఈ అవార్డును అందుకున్నారు. డిసెంబర్ 12, 2025న మషాద్లో మానవ హక్కుల న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమంలో నర్గీస్ మొహమ్మది అరెస్టు అయ్యారు. ఆమెపై రెచ్చగొట్టే వ్యాక్యలు, ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించడం, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. ఆమెను 13 సార్లు అరెస్టు చేసి ఐదుసార్లు దోషిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!