దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం…
ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి డ్యూయాలజీ తర్వాత తనరాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్”. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచాయి. ఇక రాజమౌళి మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్అవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో…
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు. Read Also : సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం.…
నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన…
గత కొద్ది నెలలుగా తెలుగువారిని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు చేరుకుంది. ఈ సీజన్ కు ఆదివారంతో తెరపడనుంది. ఫైనలిస్ట్ లుగా సన్ని, షణ్ముక్, శ్రీరామచంద్ర, మానస్, సిరి పోటీపడుతున్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరన్నది పక్కన పెడితే ఈ ఫినాలే లో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి చేయనుండటం విశేషం. శనివారం ‘బ్రహ్మాస్త’ సినిమా మోషన్ పోస్టర్ లాంఛింగ్ కోసం హైదరబాద్ వచ్చింది ‘బ్రహ్మాస్త’ టీమ్. ఇక ఇందులో నటించిన నాగార్జున బిగ్…
గత మూడేళ్లుగా రూపొందుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ కూడా సినిమాలో భాగం అయ్యారు. టీమ్ మొత్తం ఈరోజు ప్రత్యేక సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో తానే స్వయంగా ప్రదర్శిస్తానని రాజమౌళి…
హైదరాబాద్ లో తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో “బాగున్నారా… ” అంటూ మొదలెట్టిన అలియా “రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు… ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారు. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం. ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నాము. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్. ఈరోజు…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.…
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.…
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా…