‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు…
ప్రపంచ వ్యాప్తంగా ఎస్.ఎస్.రాజమౌళి చిత్రాలను అభిమానించే వారందరికీ కన్నుల పండుగ చేస్తూ ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ నేడు జనం ముందు నిలచింది. దీనిని చూసిన జనమంతా జనవరి ఏడు ఎప్పుడు వస్తుందా అన్న భావనకు లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ తో పాటు టైటిల్ కు తగ్గట్టుగానే రౌద్రం... రణం...రుధిరం... అన్నీ కనిపించేలా ట్రైలర్ ను రూపొందించారు రాజమౌళి. ఈ ట్రైలర్ ను చూసిన వెంటనే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహానికి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్ల ట్రైలర్లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం…
దర్శక ధీరుడు రాజమౌళి అన్నంత పని చేశాడు. మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దద్దరింప చేశాడు. 70 ఎం.ఎం. తెర మీద ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసి మురిసిపోవాలనుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల దాహార్తిని తీర్చాడు. ఇంతవరకూ భీమ్, రామ్ పాత్రలను పూర్తి స్థాయిలో జనాలకు చెప్పకుండా దోబూచులాడిన రాజమౌళి ఇప్పుడీ 3.07 నిమిషాల ట్రైలర్ లో ఆ క్యారెక్టర్స్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.…
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా…
జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నా.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఫెంటాస్టిక్గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్ స్క్రీన్పై చూడటానికి వెయిట్…
బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.…
వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో సంక్రాంతి బరిలో నిలిచే ఇతర సినిమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేశారు. జనవరి 6న రావాల్సిన అలియాభట్ ‘గంగూబాయి కతియవాడి’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం ఏమంటే ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో అలియాభట్ నాయికగా…