Home
Afghanistan
Afghanistan News
-
ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆక్రమణలకు అవినీతే కారణమా…!!!
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ… -
తాలిబన్ల కోసం పాక్ విద్యార్థినుల పాటలు !
తాలిబన్లను ప్రపంచమంతా అరాచక శక్తిగానే చూస్తోంది. అఫ్ఘానిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి మహిళలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంత దారుణంగా పాకిస్థాన్లో మాత్రం తాలిబన్లను కీర్తిస్తున్నారు. తాలిబన్ల విపరీత చేష్టల్ని పొగుడుతూ బాలికలతో పాటలు పాడిస్తున్నారు పాకిస్థాన్ ఛాందసవాదులు. ఇస్లామాబాద్లోని మహిళల మదర్సాలో తాలిబన్లను పొగుడుతూ పాటలు పాడారు బాలికలు. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లకు మద్దతుగా సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కట్టారు. పాకిస్థాన్లో కూడా… -
కాబూల్ విమానాశ్రయం వద్ద మళ్లీ ఉద్రిక్తత…కాల్పులు… ఏడుగురు మృతి…
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరులను, ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. తాలిబన్ల భయంలో ఆఫ్ఘన్ ప్రజలు వివిధ దేశాలకు తరలివెళ్తున్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా కాబూల్ నగరం నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేవారిపై తాలిబన్లు దృష్టిసారించారు. ఎయిర్పోర్టువైపు వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. కాల్పులు జరుపుతున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తాలిబన్లు కాల్పులకు… -
ఆ విమానంలో 640 మంది కాదు… అంతకు మించి…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు కాబూల్ నగరంలో హ్యాపీగా తిరుగుతున్న యువత ఒక్కసారిగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తానీయులు కాబూల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కాబూల్ ఎయిర్పోర్టులో అమెరికా సీ 17 విమానం ద్వారా రికార్డ్ స్థాయిలో 640 మందిని తరలించారు. ఇది పాసింజర్ రైలు కాదని, అమెరికా సీ 17 విమానం అని అమెరికా ఆర్మీ పేర్కొన్నది. అయితే, ఆ విమానంలో ప్రయాణం చేసింది640 మంది కాదని,… -
కాబూల్ ఎయిర్పోర్ట్.. కాల్పులు, తొక్కిసలాట, ఏడుగురు మృతి
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్లో అరాచకం రాజ్యమేలుతోంది… తాలిబన్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఆఫ్ఘన్ రాజధానిలోని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర తాలిబన్లు గాల్లోకి కాల్పలులు జరిపారు.. ఇతర దేశస్తులతో పాటు.. ఆఫ్ఘన్లు దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ఎయిర్పోర్ట్లకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు.. అయితే, వారిని నిలువరించడానికి కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాల్పులు జరిపారు తాలిబన్లు.. దీంతో.. భయాందోళనకు గురైన ప్రజలు.. ఒక్కసారిగా పరుగులుపెట్టారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి… -
కాబూల్ నుంచి భారత్ చేరుకున్న మరో విమానం..
తాలిబన్ల అరచకాలు మేం భరించలేం అంటూ ఆఫ్ఘనిస్థాన్ను వదిలి వెళ్లేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు.. దీంతో.. ఎయిర్పోర్ట్లకు తాకిడిపెరిగిపోయింది.. ఇక, ఆయా దేశాలను తమ దేశానికి చెందిన పౌరులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను పూనుకుంటున్నాయి.. అందులో భాగంగా.. కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానం ఇవాళ భారత్కు చేరుకుంది… ఈ విమానంలో 168 మంది భారత్కు చేరుకున్నారు. కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం.. ఇవాళ… -
తొలి ఫత్వా.. తాలిబన్ల వైఖరి తేలిపోయింది..!
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి… -
భారత్ – కాబూల్.. రోజుకు రెండు విమానాలు..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి భారత్కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల… -
కాబుల్ ఎయిర్పోర్ట్ దగ్గర హృదయవిదారక దృశ్యాలు
తాలిబన్ల పాలన మాకొద్దు.. అంటూ లక్షలాది మంది కాబుల్ ఎయిర్పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్ బయట తాలిబన్లు.. లోపల విదేశీ బలగాలు పహారా కాస్తున్నాయ్. రోజులకొద్దీ అక్కడే ఉండటంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ఆర్తనాదాలు, పసి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. కొందరైతే తమ పిల్లలైనా కాపాడాలంటూ పిల్లలను విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు. ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల… -
తాలిబన్లతో చర్చలు అనసరం: ఐరోపా సమాఖ్య
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన…
తాజావార్తలు
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!