ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి తావులేదని, షరియా చట్టం ప్రకారమే పాలన ఉంటుందని, అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతూనే, వారిపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయజెండాను ప్రదర్శిస్తున్న పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ముష్కరుల పాలన ఎలా ఉండబోతుందో చెప్పేందుకు ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇక ఆఫ్ఘనిస్తాన్లోని రాయబార కార్యాలయాలను ఇప్పటికే ఇండియా ప్రభుతవం మూసేసింది. కాబూల్, హెరాత్, కాందహార్లో భారత రాయబార కార్యాలయాలు…
ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 కి ముందు ఆ కాబూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆగస్టు 15 తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందిరికి తెలిసిందే. ఆగస్టు 15కి ముందు కాబూల్ నగరంలో యువత చాలా మోడ్రన్గా కనిపించేవారు. జీన్స్, టీషర్ట్ తో పాశ్ఛాత్య సంస్కృతికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపించేవారు. 24 గంటలు ఆ నగరంలో బయట యువత సంచరించేవారు. అయితే, ఆగస్టు…
తాలిబన్ల అరచకాలకు భయపడి ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పోటీ పడ్డారు.. తాలిబన్లు కాబూల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. కొన్ని హృదయవిదారకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ల్లోకి దూసుకెళ్లిన ప్రజలు.. ఎలాగైనాసరే ప్రాణాలతో బయటపడితే చాలు.. అనే తరహాలో.. విమానాలపైకి ఎక్కారు.. విమానాలు టేకాన్కు వెళ్తుంటే.. పరుగులు పెట్టి మరీ.. విమానాల చక్రాల దగ్గరై చోటుకోసం ప్రయత్నాలు చేశారు.. అలా విమానాలు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులకంటే ఘోరంగా దర్శనమిచ్చాయి.. అలా విమానం…
తాలిబన్లపై ఆది నుంచి అనుమానాలే.. వారు చెప్పేది ఒకటైతే.. చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఆఫ్ఘన్నిస్థాన్ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు.. ఇక యుద్ధం ముగిసిందని.. అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం.. మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి.. మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు.. ఆ స్టేట్మెంట్ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు.. అప్పడే.. డోర్డోర్ తనిఖీలు చేపట్టారు…
తాలిబన్ల ఎంట్రీతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… దేశాన్ని వదిలి పరారయ్యాడు.. ఇక, అప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్.. చట్టాల ప్రకారం తానే అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్నాడు. మరోవైపు.. తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి షాకిస్తూ.. వారి ఖాతాలను నిలిపివేస్తూ.. వారి కంటెంట్ను తొలగించేందుకు.. కొత్త కంటెంట్పై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఒక కొత్త టీమ్నే ఏర్పాటు చేసింది.. ఇన్స్టాగ్రామ్, వాట్సప్లోనూ వారి కంటెంట్పై బ్యాన్ విధించింది ఫేస్బుక్.. ఇప్పుడు…
ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజాస్వామ్యానికి దేశంలో తావులేదని, షరియా చట్టం ప్రకారమే పరిపాలన సాగుతుందని ఇప్పటికే తాలిబన్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలు ప్రాణాలకు తెగించి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నిన్నటి రోజుక నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పౌరులు పెద్దసంఖ్యలో రోడ్డుమీదకు వచ్చి జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు. కాబూల్లోని…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చెసిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. పాక్లో ఉగ్రవాద సంస్థలు అనేకం ఆశ్రయం పోందుతున్నాయి. తాలిబన్లు ఆక్రమించుకునే ముందు రోజు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అయితే, ప్రస్తుతం ఉపాద్యక్షుడు తాలిబన్లపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆఫ్ఘన్ను తనలో కలుపుకునేంత దమ్ము పాక్కు లేదని, పాలించేంతటి సీన్ తాలిబన్లకు లేదని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు.…
తాలిబన్ లు ఆఫ్ఘనిస్తాన్ను అక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో బలమైన సంబందాలు ఉన్నాయని, అక్కడ పెట్టిన పెట్టుబడులే అందుకు నిదర్శనం అని తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అయితే, తాలిబన్లు ఎలా పరిపానల చేస్తారు, ప్రపంచ దేశాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్తో వాణిజ్యంపై ఇప్పటికే తాలిబన్లు…
ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదివారం రోజున దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన వెళ్తూ 116 మిలియన్ డాలర్లను, ఖరీదైన కార్లను తనవెంట తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. పలు దేశాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. తజికిస్తాన్, రష్యాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. అయితే, దీనిపై ఆఫ్రాఫ్ ఘనీ స్పందిచారు. తాను తన స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేదని, దేశంలో రక్తపాతం జరగకూడదని దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినట్టు తెలిపారు. ప్రమాదం ముంచుకొస్తోందని భత్రతా సిబ్బంది…