Home
Afghanistan
Afghanistan News
-
ఆఫ్ఘన్లో మరో యుద్ధం: తాలిబన్లతో మాజీ ఉపాధ్యక్షుడు పోరాటం…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చెసిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. పాక్లో ఉగ్రవాద సంస్థలు అనేకం ఆశ్రయం పోందుతున్నాయి. తాలిబన్లు ఆక్రమించుకునే ముందు రోజు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అయితే, ప్రస్తుతం ఉపాద్యక్షుడు తాలిబన్లపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆఫ్ఘన్ను తనలో కలుపుకునేంత దమ్ము పాక్కు లేదని, పాలించేంతటి సీన్ తాలిబన్లకు లేదని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు.… -
భారత్తో వాణిజ్యంపై తాలిబన్ కీలక నిర్ణయం… నిలిపివేత…
తాలిబన్ లు ఆఫ్ఘనిస్తాన్ను అక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో బలమైన సంబందాలు ఉన్నాయని, అక్కడ పెట్టిన పెట్టుబడులే అందుకు నిదర్శనం అని తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అయితే, తాలిబన్లు ఎలా పరిపానల చేస్తారు, ప్రపంచ దేశాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్తో వాణిజ్యంపై ఇప్పటికే తాలిబన్లు… -
కట్టుబట్టలు…ఉత్త చేతులతోనే ఆఫ్ఘన్ను విడిచాను- అష్రాఫ్ ఘనీ…
ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదివారం రోజున దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన వెళ్తూ 116 మిలియన్ డాలర్లను, ఖరీదైన కార్లను తనవెంట తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. పలు దేశాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. తజికిస్తాన్, రష్యాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. అయితే, దీనిపై ఆఫ్రాఫ్ ఘనీ స్పందిచారు. తాను తన స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేదని, దేశంలో రక్తపాతం జరగకూడదని దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినట్టు తెలిపారు. ప్రమాదం ముంచుకొస్తోందని భత్రతా సిబ్బంది… -
అనుకున్నట్టుగానే అయింది… షరియా చట్టం ప్రకారమే…
ఆఫ్ఘనిస్తాన్లో ఆరాచక పాలన అమలౌతుందని అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. అయితే, తాలిబన్లు అలాంటి పాలన ఉండబోదని, ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి గంటలు గడవక ముందే అక్కడ ఆరాచకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండా ఎగరవేసిన చోట తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్లకార్డులు పట్టుకున్న మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారు. అనుకున్నట్టుగానే అక్కడ తాలిబన్లు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తావులేదని ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే… -
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై జీ 7 కీలక నిర్ణయం…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆక్రమణల తరువాత జరుగుతున్న పరిణామాలను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్లోని రాయబార కార్యాలయాలను అనేక దేశాలు మూసేశాయి. తాలిబన్లు శాంతియుతంగా పరిపాలన అందిస్తామని చెబుతూనే అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. వచ్చే వారం జీ 7 దేశాలు సమావేశమయ్యి ఆఫ్ఘన్ పరిస్తితులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని పౌరుల రక్షణకు మానవతా దృక్పధంలో ఆదుకోవడానికి… -
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఏ దేశంలో ఉన్నాడంటే…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే ముందు రోజే అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. సంచుల నిండా ధనం, కార్లతో ఆయన దేశం విడిచి హెలికాఫ్టర్లో వేరే దేశానికి వెళ్లిపోయాడు. అయితే, ఆయన ఏ దేశంలో ఉన్నాడు అన్నది బయటకు రాలేదు. తాజాగా మాజీ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనికి యూఏఈ ఆశ్రయం ఇచ్చినట్టు పేర్కొన్నది. మానవతా దృక్పదంతో ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్టుగా ఆ దేశం తెలియజేసింది. అయితే, ఘని ఏ నగరంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో… -
ఒకవైపు మద్దతిస్తూనే… సరిహద్దుల వెంట పాక్ కంచెను నిర్మించడానికి కారణం?
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే… -
అప్పుడు బుద్దుడి విగ్రహం…ఇప్పుడు హజారా నాయకుడి విగ్రహం…
2001లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలో ఉండగా బమియన్ లోని బుద్ధుని భారీ విగ్రహాన్ని పేల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బమియన్లోని హజారా జాతి నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజారా జాతికి చెందిన వ్యక్తులు అప్పట్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హజరాజత్ అనే పర్వత ప్రాంతాల్లో నివశించే ప్రజలను హజారాలు అని పిలుస్తారు. మంగోల్ సామ్రాజ్యస్థాపకుడు ఛెంగిజ్ ఖాన్ వారసులు. 13 వ శతాబ్ధం నుంచి ఈ… -
ప్రపంచం ముందు మరో భయం: తాలిబన్ల విజయం వెనుక అరుణదళం…
1994లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అమెరికా, నాటో దళాలు తాలిబన్లపై యుద్దం ప్రకటించిన తరువాత తాలిబన్లు వేగంగా వైదొలిగారు. 20 ఏళ్లు ప్రజాస్వామ్య పాలన సాగింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమెరికా ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక సరా ఖేటా అనే దళం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఫష్తో… -
అఫ్ఘాన్లో సామాన్యుల పరిస్థితి ఏంటి…?
అఫ్ఘానిస్థాన్లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్లోని కీలక పట్టణాలన్నింటినీ…
తాజావార్తలు
-
Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?