ఆఫ్ఘన్లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత అక్కడ కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తున్నదో, కేసులు ఎమయ్యాయో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్: వాయిదాల్లో చెల్లించండి… ఆఫ్ఘన్లోని 3 మిలియన్ మంది పిల్లలకు…
ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్లపాటు సేవలు అందించిన అమెరికా దళాలు అగస్ట్ 30 వ తేదీ వరకు పూర్తిగాఖాళీ చేసి వెళ్లిపోయాయి. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేని వ్యక్తులు ఆ దేశాన్ని వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు. అమెరికా దళాలు వెళ్లే సమయంలోచాలా మందిని శరణార్థులను విదేశాలకు తరలించింది అమెరికన్ సైన్యం. కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారిని అమెరికా సైనికుడు అందుకొని లోపలికి తరలించాడు. ఓ గంట…
ఈరోజు న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై టీం ఇండియాతో పాటు భారత అభిమానులు మొత్తం ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆఫ్మఘం గెలవాలని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 ఒరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో నజీబుల్లా ఒక్కడే 73 పరుగులతో రాణించాడు.…
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాలిబన్లు సొంత ఎయిర్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయింది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర మిలిటెండ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగడాలు తగ్గిపోతాయని తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల ఆక్రమణల తరువాత, వారిని స్పూర్తిగా తీసుకొని దేశీయంగా కొన్ని తీవ్రవాద సంస్థలు బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాల్లోని మసీదుల్లో పెలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వందలాది మంది సామాన్యులు బలైపోతున్నారు. Read: కొత్తగా పెళ్లైన వారు హ్యాపీగా…
ఈరోజు యావత్ భారతం అప్ఘనిస్తాన్ వైపు నిలబడనుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు, పలువురు నెటిజన్లు తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మీమ్స్లో రషీద్ ఖాన్పై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫోటో ఫన్నీగా ఉంది.
టీ20 ప్రపంచకప్లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: నేడే న్యూజిలాండ్తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష ! అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్…
ఇవాళ న్యూజిలాండ్పై అఫ్గానిస్తాన్ గెలుస్తుందా? భారత్ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్ కప్లో భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్, కివీస్తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్ సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్, స్కాట్లాండ్పై…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆహారం లేక లక్షలాది మంది ప్రజలు అలమటిస్తున్నారు. మానవతా దృక్పధంలో కొన్ని దేశాలు ఆహారం వంటివి సరఫరా చేస్తున్నా, అవి కొంత వరకు మాత్రమే సరిపోతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏ ప్రపంచ దేశం కూడా అధికారికంగా గుర్తించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్టుగా తాలిబన్లు అక్కడి ప్రజలపై కఠినమైన చట్టాలు అమలు చేస్తూ మరిన్ని బాధలు పెడుతున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఫ్రీజ్…
టీ20 ప్రపంచకప్లో ఎట్టకేలకు టీమిండియా ఖాతా తెరిచింది. బుధవారం రాత్రి అఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వరుసగా మూడోసారి భారత కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఈ ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Read Also: దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్ ముందు భారీ…