Gujarat Drugs Case: గుజరాత్ లో డ్రగ్స్ దందా.. రూ.1500 కోట్లపై మాటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1,500 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
గత ఏడాది కరోనా టైంలోనే డ్రగ్స్ ముఠా తమ కార్యకలాపాలు విస్తరించింది. సముద్రమార్గాన డ్రగ్స్ రవాణాకు తెరతీసింది. ఆప్ఘనిస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడకు తరలివస్తున్న వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ను గుజరాత్లోనే అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో అది సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. నాడు ఈ వ్యవహారంపై రాజకీయంగానే పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా కావడం కలవరం కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అటు గంజాయి, ఇటు డ్రగ్స్ దందా పోలీసులకు, నార్కోటిక్ అధికారులకు సవాల్ గా మారింది. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ టెస్ట్ లకు కూడా పోలీసులు రెడీ అయ్యారు. కాలేజీల్లో, పబ్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే యువత డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్ ని నాశనం చేసుకోవడం ఖాయం.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: IPL 2022 : ఉత్కంఠ నడుమ విజయం సాధించిన సీఎస్కే.. ధోని సూపర్ ఇన్నింగ్స్..
- Tags
- Afghanistan
- ap
- DRI
- drugs case
- Gujarat
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?