రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. నేడు ఇంద్రవెళ్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీతక్క హాజరుకానున్నరు. అక్కడ అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించనున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల అభిప్రాయలను తెలుసుకున్నారు. ఏఎన్ రెడ్డి కాలనీలో క్లబ్ హౌజ్ లో కార్యకర్తల సమావేశం అయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మెజార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ స్థానాల సంబంధించి ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ లేఖతో అప్రమత్తమయ్యారు. ఇక ఈ లేఖలో మావోయిస్టులు ఏం రాసారన్న విషయానికి వస్తే.. Also read: ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. వంద రోజుల్లో 55 కి పైగా కేసులు…
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
Adilabad Rains: భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లా వాసులకు వాన జల్లులు పలకరించాయి. ఇవాళ ఉదయం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది.
ఈమధ్య కాలంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎంతసేపు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి పని చెప్పకుండా డబ్బులు సంపాదించే మార్గాలను శోధిస్తున్నారు. ఇకపోతే చాలామంది డబ్బులు వక్రమార్గంలో సంపాదిస్తున్నారు. కొందరు బతకడానికి దొంగతనాలు చేస్తుండగా.. మరికొందరు కొన్ని అడ్డదారుల్లో నడుస్తున్నారు. కొందరైతే బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యంను అక్రమంగా తీసుకోవచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల కంటే పక్క…
ఆదిలాబాద్ బీజేపీలో నూతన చేరికల దుమారం చెలరేగింది. నిన్న బీజేపీలో గడ్డం నగేష్ చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బిఎల్ సంతోష్, లక్ష్మణ్ ని ఆదిలాబాద్ బీజేపీ నేతలు కలిశారు. బీజేపీలో నగేష్ చేరిక, లోక్ సభ స్థానాన్ని ఇవ్వడాన్ని ఆదిలాబాద్ బంజారా నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపురావు(మాజీ ఎమ్మెల్యే) వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని…
CM Revanth Reddy Speech in Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని, అభివృద్ధి విషయంలో మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధానికి సీఎం స్వాగతం…