Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు ఆదివాసీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. నేడు ఇంద్రవెళ్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీతక్క హాజరుకానున్నరు. అక్కడ అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించనున్నారు. ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపం వద్దకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తున్నారు.
ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 43 ఏళ్లు. రైతు కూలీ సంగం ఆదివాసీల స్మారకార్థం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించింది. 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమైట్తో స్థూపం పేల్చివేయడంతో.. గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం 1987లో ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపాన్ని నిర్మించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలోని రికార్డుల ప్రకారం మండలంలోని ముట్నూర్ సమీపంలో 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. హక్కు పత్రాలతో పాటు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు. అమరవీరుల స్థూపాన్ని స్మారక పార్కుగా మార్చేందుకు రూ.97 లక్షలు కేటాయించారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
Read also: Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..
అసలేం జరిగింది..?
హక్కుల కోసం ఉద్యమిస్తున్న అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గిరిపుత్రులు చనిపోయారు. రక్తపు మరకలు ఇప్పటికీ కొట్టుకుపోలేదు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. నాడు వ్యాపారులు, అధికారుల చేతుల్లో దోపిడికి గురైన గిరిజనం ఉద్యమానికి సిద్ధమైంది. దీంతో గిరిజన గ్రామంలో పోలీసుల బూట్ల చప్పుడు మొదలైంది. ఈనేపథ్యంలో గిరిజన సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. ఈ క్రమంలో అడవుల్లోని ఖాళీ భూముల్లో గిరిజనులు దున్నేందుకు పూనుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో పలు సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నాటి ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. అయినా గిరిజన సంఘాలు వెనక్కి తగ్గలేదు. రైతు సంఘాలు నిర్వహించిన సభకు ఆనాటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇదేమీ తెలియని ఆదివాసీలు సభకు భారీగా తరలివచ్చారు. సభను అడ్డుకునేందుకు నాటి పోలీసులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. వాహనాలను అడ్డుకునేందుకు రోడ్లను దిగ్బంధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఓ గిరిజన యువతితో ఓ జవాన్ అసభ్యంగా ప్రవర్తించాడు.
Read also: Beauty : మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చేస్తున్న మారుతీ..
ఆ యువతి తనపై అకారణంగా చేయి వేశాడని కొడవలితో వేటు వేసింది. అంతే జవాన్ కిందపడిపోయాడు. ఇంతలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తుపాకీలను ఆశ్రయించారు. తుపాకుల మోతతో ఇంద్రవెల్లి వణికిపోయింది. పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై చిందేసింది. వందలాది మంది గిరిజనులు పెద్దగా కేకలు వేస్తూ వాగుల వెంట పరుగులు తీశారు. ఈ ఒక్క ఘటనతో ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. గిరిజనులతో పాటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడవిబిడ్డల్లో దాగిన చీకట్లను తరిమికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలనే సంకల్పం ఓ గొప్ప ఉద్యమానికి దారితీసింది. ప్రజల ప్రాణాలు తీసింది. ఇంద్రవెల్లిలో ఓ ఆదివాసీ మహిళతో ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తించడం హింసకు దారి తీసింది. పోలీసులు తుపాకులు, బుల్లెట్లతో ఎదురుదాడి చేయగా, గిరిజనులు కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన విప్లవకారుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఏప్రిల్ 20వ తేదీ రాగానే చాలామంది ఈ సంఘటన గుర్తొచ్చి భయంతో వణికిపోతున్నారు.
Karnataka: ముస్లిం మహిళకు రైడ్ ఇవ్వడంతో.. యువకుడిపై దాడి.. చివరకి..
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!