ఆదిలాబాద్ రిమ్స్ లో కాలం చెల్లిన ఇంజెక్షన్ ల పై విచారణ కొనసాగుతుంది. వాటిని మూడవ అంతస్తులోని పురుషుల వార్డులో కొంతమంది రోగులకు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రోగి బందువు గుర్తిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అంతవరకు రిమ్స్ వైద్యసిబ్బంది వాటిని గుర్తించలేదు. అయితే దీని పై విచారణ చేపట్టిన రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్… తప్పు జరిగింది. అదెలా జరిగిందో అరా తీస్తున్నా అని ఎన్టీవీతో తెలిపారు. సెఫ్ట్రియోక్సన్ అనే కాలం చెల్లిన ఇంజెక్షన్లు…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 26 పైసలు, లీటర్ డీజిల్పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. కాగా తెలంగాణలో పెట్రోల్ సెంచరీ దాటింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే 10 శాతానికి పైగా కరోనా వృద్ధి కనిపించింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపాపధ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గత రెండు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. మండలకేంద్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్…