ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది… గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగన జనసేన ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమంటూ స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆయన.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే…
టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్. 41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి…
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు…
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక…
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ట్రిపుల్రెడ్డి దారెటు? రెండు దఫాలుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎందుకు బరిలో దిగాలని అనుకుంటున్నారు? ఏ పార్టీనో స్పష్టత ఇవ్వకుండా గాలివాటాన్ని నమ్ముకున్నారా? ఇంతకీ ఎవరా ట్రిపుల్రెడ్డి? 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్ ప్రకటన..! దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగి.. సడెన్గా పాలిటిక్స్ వద్దని అనుకుని 2014 ఎన్నికల్లో సైలెంట్ అయ్యారు మాజీమంత్రి దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. ఇంటి పేరును కలిపి ఇలా మొత్తంగా…
టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో అటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.…
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్…
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.…